- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 242 మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దర్యాప్తుకు ఆదేశించింది. ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఎయిర్పోర్టుకు సమీపంలోని సివిల్ ఆస్పత్రి వద్ద బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ (medical college hostel) భవనంపై కుప్పకూలింది. విమానంలో 169 మంది భారతీయులు, మరో 53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒకరు కెనడా జాతీయుడు ఉన్నారు.
- Advertisement -