హైదరాబాద్: గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో తెలుగు రాష్ట్రాల్లో సమిష్టిగా బస్ బుకింగ్లో 30 శాతం వృద్ధి నమోదయ్యిందని ప్రముఖ ఆన్లైన్ బస్ బుకింగ్యాప్ రెడ్ బస్ వెల్లడించింది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ, తిరుపతి-బెంగళూరు, విశాఖపట్నం-హైదరాబాద్ అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఉన్నాయని పేర్కొంది. ఇందులో హైదరాబాద్ ప్రధాన రవాణా కేంద్రంగా నిలిచిందని పేర్కొంది. 56 శాతం మంది ప్రయాణికులు ఒక్క రోజు ముందు బుకింగ్ చేసుకోగా.. 40 శాతం మంది 1-7 రోజులు ముందు బుకింగ్స్ను చేసుకున్నారని రెడ్బస్ సిఎంఒ పల్లవి చోప్రా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎల్లప్పుడూ ఇంటర్సిటీ ప్రయాణంలో ముందంజలో ఉన్నాయన్నారు.