- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని మణికొండలో పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మణికొండలోని పుప్పాలగూడలో 35 అడుగుల పొడవున్న ఓ గోడ కూలిపోయింది. దీంతో మూడు ఇండ్లు మట్టిదిబ్బల్లో కొట్టుకుపోయాయి. అయితే ఆ సమయంలో ఇండ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. 2008లో శివాలయానికి రక్షణగా ఈ గోడను ఆలయ కమిటీ నిర్మించింది. అయితే రాత్రి కుండపోతగా వర్షం కురవడంతో అది కూలిపోయింది.
- Advertisement -