- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రానికి 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా చేరిందని, ఇవాళ మరో 5 వేల మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పారు. అదనంగా వారం రోజుల్లో 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కానుందని వెల్లడించారు. యూరియా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని,5 రోజుల్లో పంట నష్టంపై సర్వే పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
- Advertisement -