విరాట్ కర్ణ హీరోగా దర్శకుడు అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘నాగబంధం’. లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్తో కలిసి ఎన్ఐకె స్టూడియోస్ బ్యానర్పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం మేకర్స్ ఒక కీలకమైన సన్నివేశాన్ని, ఒక పాటను భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అనంత పద్మనాభ స్వామి ఆలయం సెట్లో పాటను చిత్రీకరించారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య పర్యవేక్షణలో విరాట్ కర్ణతో పాటు 5000 మంది నత్యకారులు ఈ పాటలో పాల్గొన్నారు. ఈ ఒక్క ఎపిసోడ్కే రూ.10 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ‘నాగబంధం’ ఒక విజువల్ వండర్గా ఉండబోతోంది. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్స్గా నటిస్తుండగా, జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్న కథాంశాన్ని మిళితం చేస్తూ పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివత్తాలతో ఈ సినిమా ఉంటుంది. ఈ పవిత్ర స్థలాలను రక్షించే నాగబంధం పురాతన ఆచారాలపై దష్టి సారించి, భారతదేశంలోని విష్ణు దేవాలయల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఇందులో అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఈ సినిమా విడుదల కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.