నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల భారీ వర్షాలకు అసోం అల్లకల్లోలమైన విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన వానాలకు బ్రహ్మపుత్ర నదిలోకి వర్షపు నీరు భారీగా పోటెత్తాయి. దీంతో పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. ఈ వరద ఉధృతికి పలు ప్రాంతాల్లో ఇండ్లు నీటమునిగాయి. నిత్యావసర వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అయితే ఇటీవల వర్షం విరామం ఇవ్వడంతో పలు ప్రాంతాలు వరద ముప్పునుంచి తేరుకోగా..మారిగావ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు వరద ముప్పునుంచి ఇంకా విముక్తి కలుగలేదు. ఆ జిల్లా పరిధిలో 64 గ్రామాలు వరద నీటితో జలదిగ్భందమైయ్యాయి. దీంతో వరద బాధితులకు సహాయ సహాకారాలు అందించడానికి పెను సవాల్ ఎదురైతున్నాయి. మారిగావ్ పరిధిలో దాదాపు 200పైగా కుటుంబాలకు నివసిస్తున్నాయి.వరద ముప్పు తీవ్రంగా ఉన్న ఆయా ప్రాంతాలకు ఆహార పదర్థాలు సరఫరా చేయడం, వైద్యం సాయమందించడం కష్టం ఉందని అధికారులు చెప్పుతున్నారు.
మారిగావ్లో తగ్గని వరద..64 గ్రామాలు జలదిగ్భందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES