Thursday, June 19, 2025
E-PAPER
Homeసినిమావిజువల్‌ ట్రీట్‌గా '8 వసంతాలు'

విజువల్‌ ట్రీట్‌గా ‘8 వసంతాలు’

- Advertisement -

మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘8 వసంతాలు’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతోంది. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సునీల్‌కుమార్‌ లీడ్‌ రోల్‌ పోషించారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 20న వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. డైరెక్టర్‌ ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ,’మైత్రి మూవీ మేకర్స్‌ నవీన్‌, రవి చాలా అద్భుతమైన వ్యక్తులు. చిన్న సినిమా పెద్ద సినిమాని కాదు… మంచి సినిమానా కాదా అనేది చూస్తారు. ఒక మంచి సినిమా వస్తే చేస్తారనే దానికి నేనే నిదర్శనం. ఈ సినిమాతో ఒక మంచి నిర్మించారనే పేరు వారికి వస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. చాలా మంది కొత్తవారికి ఉనికిని ఇచ్చారు. ఇది డబ్బు కంటే చాలా గొప్ప విషయం. అనంతిక గొప్ప పెర్ఫార్మర్‌. శుద్ధి అయోధ్య పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఓపెన్‌ సీక్వెన్స్‌ మిస్‌ అవ్వొద్దు. సినిమా అంతా రివర్స్‌లో వెళ్తుంది. అందుకే ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ ఎవరు మిస్‌ అవ్వద్దు అని కోరుతున్నాను’ అని తెలిపారు. ‘అయోధ్య లాంటి గొప్ప పాత్రలో నన్ను నమ్మిన ఫణింద్రకి ధన్యవాదాలు. ఇప్పటివరకు నాలుగైదు సినిమాలు చేశాను. కానీ ఇలాంటి అనుభవం నా జీవితంలో ఎప్పుడూ లేదు. శుద్ధి లాంటి స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌ చేస్తానని అని ఎప్పుడూ అనుకోలేదు’ అని హీరోయిన్‌ అనంతిక చెప్పారు.
ప్రొడ్యూసర్‌ రవిశంకర్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాకి అనంతిక, ఫణి బిగ్గెస్ట్‌ పిల్లర్స్‌. రవి హను కుడా అద్భుతంగా నటించారు. విజువల్‌గా అదిరిపోయింది. చాలా ఎమోషనల్‌ కంటెంట్‌ చెప్పాడు ఫణి. ఈ ప్రయత్నం డెఫినెట్‌గా సక్సెస్‌ అవుతుందని అందరం ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘కథ బాగా నచ్చి మేము చేసిన ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది. చాలా కొత్త టాలెంట్‌ ఇందులో వర్క్‌ చేశారు. వాళ్ళందరి కోసం ఈ పెద్ద విజయం సాధించాలి’ అని ప్రొడ్యూసర్‌ నవీన్‌ యెర్నేని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -