Tuesday, June 24, 2025
E-PAPER
Homeసినిమా'8 వసంతాలు' ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా

‘8 వసంతాలు’ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా

- Advertisement -

మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనంతిక సనీల్‌కుమార్‌ లీడ్‌ రోల్‌ పోషించారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ రూపొందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై అందరినీ ఆకట్టుకొని హార్ట్‌ వార్మింగ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో హీరోయిన్‌ అనంతిక సనీల్‌కుమార్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాకి ఆడియెన్స్‌ చాలా ప్రేమ ఇచ్చారు. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. థియేటర్స్‌లో సినిమా చూస్తున్నప్పుడు చాలా గ్రేట్‌ఫుల్‌గా అనిపించింది. నా క్యారెక్టర్‌కి ప్రేక్షకుల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుంది. చాలా కాంప్లిమెంట్స్‌ వస్తున్నాయి. ముఖ్యంగా ఫైట్‌ సీక్వెన్స్‌ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ పాత్ర నా పర్సనల్‌ లైఫ్‌లో కూడా చాలా చోట్ల కనెక్ట్‌ అయ్యింది. సినిమాకి అందరూ చాలా అద్భుతంగా కనెక్ట్‌ అవుతున్నారు’ అని అన్నారు. నటుడు హనురెడ్డి మాట్లాడుతూ,’ఇలాంటి మంచి టీంతో కలిసి పని చేయడం ఒక బ్లెస్సింగ్‌గా భావిస్తున్నాను. సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇది ఎప్పటికీ గర్వపడే సినిమా. ఇలాంటి సినిమాతో డెబ్యూ చేయడం అదష్టంగా భావిస్తున్నాను’ అని చెప్పారు.
‘ప్రీమియర్స్‌ నుంచి ఇప్పటిదాకా 6 షోస్‌ చూశాను. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. మా డైరెక్టర్‌ ఈ సినిమాకి ప్రేక్షకుడిలా వెళ్లి ప్రేమికుల్లా బయటకి వస్తారని చెప్పారు. అది ఈ రోజు జరిగింది. చాలా స్వచ్ఛమైన తెలుగు సినిమా చూశామని ప్రేక్షకులు చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చూడాల్సిన వాళ్లు తప్పకుండా సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. డైరెక్షన్‌, విజువల్స్‌, మ్యూజిక్‌, ప్రొడక్షన్‌ పరంగా ఇది చాలా పెద్ద సినిమా. టాప్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ మైత్రి మూవీ మేకర్స్‌ ఇలాంటి బ్యూటీఫుల్‌ సినిమాని అందించినందుకు ఒక ప్రేక్షకుడిగా వారికి కతజ్ఞతలు తెలుపుతున్నాను. డైరెక్టర్‌ ఫణికి థాంక్యూ. చాలా అద్భుతమైన సినిమా ఇచ్చారు. ఈ సినిమా జర్నీ ఇప్పుడే మొదలైంది. ఈ సినిమా చాలా ఏళ్లు పాటు గుర్తుండిపోతుంది. ఒక స్త్రీ పాత్రను ఎంత అద్భుతంగా చూపించవచ్చో చెప్పడానికి ఈ సినిమా ఒక రిఫరెన్స్‌గా నిలుస్తుంది’ అని మరో నటుడు రవి తెలిపారు. డిఓపి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ,’గత రెండు రోజులుగా చాలా థియేటర్స్‌ తిరిగాను. అన్ని హౌస్‌ఫుల్స్‌ ఉన్నాయి. దాదాపు 20 సంవత్సరాలు అయింది ఇలాంటి సినిమా చూసి అని ప్రేక్షకులు చెప్పారు. అది చాలా హ్యాపీనెస్‌ ఇచ్చింది. ఈ సినిమాకి వచ్చిన ప్రతి కాంప్లిమెంట్‌ చాలా ఆనందాన్నిచ్చింది. సినిమాని హై ప్రొడక్షన్‌ స్టాండర్డ్స్‌తో తీశాం. మైత్రి మూవీ మేకర్స్‌ చాలా సపోర్ట్‌ చేశారు. ఇదంతా టీం వర్క్‌. జనాలు చూసి చాలా మెచ్చుకుంటున్నారు. ఇది ప్యూర్‌ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న సినిమా’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -