Monday, June 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతు

గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని కోనసీమ జిల్లాలో 8 మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. ముమ్మడివరం మండలం కమినిలంక వద్ద స్నానానికి 11 మంది గోదావరి నదిలో దిగారు. లోతైన ప్రాంతం కావడంతో వీరిలో 8 మంది గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు సురక్షితంగా బయటకొచ్చారు. ఈ 11 మంది కె.గంగవరం మండలం శురుల్లంకలో ఓ శుభకార్యానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, గల్లంతైన వారిని కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్‌, సాయి, సతీశ్‌, మహేశ్‌, రాజేశ్, రోహిత్‌, మహేశ్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -