Friday, June 27, 2025
E-PAPER
HomeNewsఇజ్రాయిల్‌ దాడుల్లో 90 మంది పాలస్తీనియన్లు మృతి

ఇజ్రాయిల్‌ దాడుల్లో 90 మంది పాలస్తీనియన్లు మృతి

- Advertisement -



గాజా : ఇజ్రాయిల్‌ గురువారం జరిపిన దాడుల వల్ల గాజాలో 14 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 90 మంది మృతి చెందినట్టు గాజా ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయిల్‌ గాజాతోనే కాకుండా పొరుగు దేశాలను కూడా ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తోంది. తాజాగా వెస్ట్‌ బ్యాంక్‌లోని రామల్లాకు ఈశాన్యంగా ఉన్న కాఫర్‌ మాలెక్‌పై జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందారు.
మెక్సికోలో కాల్పులు.. 12 మంది మృతి.
మెక్సికోలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. గ్వానాజువాటలోని ఇరాపువాటో నగరంలో స్ట్రీట్‌ ఫెస్టివల్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంద్రి మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో రాత్రివేళ కొందరు వ్యక్తులు ఓ స్ట్రీట్‌ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా డ్రమ్స్‌ వాయిస్తూ డ్యాన్స్‌ చేస్తూ ఉండగా.. గుర్తు తెలియని దుండగుడు అక్కడి వచ్చి వారిపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనను మెక్సికన్‌ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ తీవ్రంగా ఖండించారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. గత నెలలో, గ్వానాజువాటోలోని శాన్‌ బార్టోలో డి బెర్రియోస్‌లో కాథలిక్‌ చర్చి నిర్వహించిన పార్టీని లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -