Thursday, June 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 9,404 మంది మహిళా అభ్యర్థుల ఉత్తీర్ణత

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 9,404 మంది మహిళా అభ్యర్థుల ఉత్తీర్ణత

- Advertisement -

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 9,404 మంది మహిళా అభ్యర్థుల ఉత్తీర్ణత
– 2017 తరువాత అత్యధికం
న్యూఢిల్లీ:
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు లింగ ప్రాతినిధ్యంలో పురోగతిని చూపిస్తున్నాయి. ఈ ఫలితాల ప్రకారం రికార్డు స్థాయిలో 9,404 మంది మహిళా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 2017 తరువాత మహిళా అభ్యర్థులు ఈ స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం ఇదే మొదటిసారి. 2017లో 7,137 మంది (14.1 శాతం) మహిళా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. తాజాగా మళ్లీ 9,404 మంది (17.3 శాతం) మహిళా అభ్యర్థులు ఉత్తర్ణీత సాధించడం ఎక్కువ మంది మహిళలు స్టెమ్‌ కోర్సుల్లోకి ప్రవేశించేలా ప్రోత్సహిస్తుందని విద్యా రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. మోషన్‌ ఎడ్యుకేషన్‌ వ్యవస్థాపకులు, సీఈఓ నితిన్‌ విజరు మాట్లాడుతూ మహిళా అభ్యర్థులు సానుకూల ధోరణిలో విజయాలు సాధిస్తున్నారని చెప్పారు. 2023లో ఐఐటిల్లో కొత్తగా 1,364 బిటెక్‌ సీట్లు పెంచడం, అలాగే, 20 శాతం మహిళా సూపర్‌న్యూమరీ కోటా జతచేయడంతో మహిళా అభ్యర్థులకు అవకాశాలు పెరిగాయని తెలిపారు. మహిళా అభ్యర్థుల ఉత్తీర్ణత సంఖ్య పెరుగుతుండటం, వారికి అవకాశాలు కూడా పెరుగుతుండటంతో భవిష్యత్‌లో దేశంలోని ప్రధాన సాంకేతిక సంస్థల్లో లింగ ప్రాతినిధ్యంలో అంతరాలు తగ్గుతాయనే విశ్వాసం కలుగుతుందని అన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025కి మొత్తంగా దాదాపు 1.90 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, వీరిలో సుమారు 43 వేల మంది మహిళా అభ్యర్థులు. ఐఐటీల్లో 20 శాతం మహిళా సూపర్‌న్యూమరీ కోటా అమలు కొనసాగుతున్న కారణంగా అఖిల భారత ర్యాంకుల్లో టాప్‌- 25 వేల వరకూ ర్యాంకుల్లో నిలిచిన మహిళలకు ప్రవేశం లభించే అవకాశం ఉంది.కాగా, మేలో జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష కఠినంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా గణితం పేపరు చాలా కష్టంగా ఉందని చెప్పారు. సమాధానాలు రాబట్టడానికి ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు ఉన్నాయని తెలిపారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం పేపర్లు కూడా ఇదే విధంగా ఉన్నాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -