- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న వెనుజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదో ఎంపికపై ఆగ్రహించిన వెనుజువెలా ప్రభుత్వం, నార్వేలోని తమ దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. వెనుజువెలా నిర్ణయంపై నార్వే అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విభేదాలున్నా చర్చలు కోరుకుంటున్నట్లు, నోబెల్ బహుమతి ప్రకటన తమ స్వతంత్ర నిర్ణయమని స్పష్టం చేసింది.
- Advertisement -