- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో 783 మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోనున్నారు. విభాగాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో వీరిని నియమించేలా ఏర్పాట్లు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
- Advertisement -