- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మెన్స్ టీమ్ వన్డే కెప్టెన్గా మహ్మద్ రిజ్వాన్ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తొలగించింది. బౌలర్ షాహీన్ అఫ్రీదిని నూతన సారథిగా నియమించింది. వచ్చే నెల 4న దక్షిణాఫ్రికాతో మొదలయ్యే మూడు వన్డేల సిరీస్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 25 ఏళ్ల ఈ పేసర్ 66 వన్డేల్లో 131 వికెట్లు తీశారు. 2024లో న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం అఫ్రీదికి ఉంది.
- Advertisement -