- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల గాజా-ఇజ్రాయిల్ మధ్య రెండేళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతు..ఇరుదేశాలు గాజా శాంతి ప్రణాళిక ఒప్పందంపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ దళాల్లో పాక్ సైనికులు కూడా పాలుపంచుకోనున్నారు. ఒప్పందం ప్రకారం, పాకిస్థాన్ దాదాపు 20,000 మంది సైనికులను గాజాకు పంపనుంది. ఈ దళాలు గాజాలో అంతర్గత భద్రతను పర్యవేక్షించడం, మానవతా సాయం అందించడం, పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి బాధ్యతలు చేపడతాయి. అన్నింటికంటే ముఖ్యంగా, హమాస్ను నిరాయుధీకరణ చేయడంలోనూ, సరిహద్దు భద్రతను పటిష్టం చేయడంలోనూ ఈ సైన్యం కీలక పాత్ర పోషించనుంది.
- Advertisement -



