- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో మూడు చక్రాల విభాగంలో కొత్తగా బజాజ్ గోగోను విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్లో రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ వాహనంను ఒకసారి చార్జ్ చేస్తే 251 కి.మీ వరకు ప్రయాణించగలదని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దీని ప్రారంభ ధరను రూ.3,26,797గా నిర్ణయించింది. ఈ కార్య క్రమంలో బజాజ్ ఆటో లిమిటెడ్ ఇంట్రాసిటీ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు సమర్దీప్ సుబంధ్, వినాయక బజాజ్ ఎండీ కె వి బాబుల్ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -