నవతెలంగాణ- చిన్నకోడూరు
చిన్నకోడూరు మండల విద్యాధికారిగా మండల పరిధిలోని గోనెపెల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న పాశికంటి తిరుపతిని మండల విద్యాధికారిగా పదవి బాధ్యతలను చేపట్టిన అతన్ని మంగళవారం ఘనంగా సన్మానించారు . గతంలో ఎంఈఓ గా పనిచేసిన యాదవ రెడ్డి పదవి విరమణ పొందాడు. మండలంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు, గోనెపెల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తన స్వగ్రామమైన ఇబ్రహీం నగర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నెమలి సుభాష్ తో పాటు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని నూతనంగా ఎంఈఓ గా బాధ్యతలు చేపట్టినతిరుపతి ని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలోని మన మండలాన్ని అగ్రగామిగా నిలబెడతానని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను అందజేయడానికి కృషి చేస్తానన్నారు.
మండల విద్యాధికారిగా పాశి కంటి తిరుపతి
- Advertisement -
- Advertisement -



