Wednesday, April 30, 2025
Homeసినిమాక్లైమాక్స్‌లో కన్నీటి పర్యంతమవుతారు

క్లైమాక్స్‌లో కన్నీటి పర్యంతమవుతారు

కళ్యాణ్‌ రామ్‌, విజయశాంతి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైైజయంతి’. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించారు. అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మించారు. ఈ సినిమా ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ మ్యాసీవ్‌ ప్రీరిలీజ్‌, ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, ‘ఈ వేదిక పైన నేను, అన్నయ్య నిలుచుని ఉన్నప్పుడు నాన్న చాలా సార్లు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈరోజు విజయశాంతి మాట్లాడుతుంటే నాన్న లేని లోటు తీరినట్లు అయింది. ఈ సినిమా నేను చూశాను. విజయశాంతి లేకపోతే ఈ సినిమా లేదు. 18వ తేదీన మీ అందరి ముందుకు రాబోతుంది ఈ సినిమా. రాసి పెట్టుకోండి. ఆఖరి 20 నిమిషాలు థియేటర్స్‌లో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంత అద్భుతంగా మలిచారు. ప్రతిసారి కాలర్‌ ఎగరేయమని నేను చెప్తుంటాను. ఈసారి కళ్యాణ్‌ అన్న కాలర్‌ని నేను ఎగరేస్తున్నాను. ఈ సినిమా కళ్యాణ్‌ అన్న కెరీర్‌లో ఒక స్పెషల్‌ మూవీగా నిలిచిపోతుంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img