- Advertisement -
నవతెలంగాణ కల్వకుర్తి టౌన్
వెల్దండ మండలం రాచూర్ గ్రామంలో ఉన్న వెంటేజ్ కాపీ కంపెనీ లో మంగళవారం వరద నీరు చేరింది. తుఫాను కారణంగా పైన ఉన్న రేకులు గాలి బీభత్సానికి ఎగిరిపోవడంతో వర్షం నీరు పై నుండి కంపెనీ లోపల పడి జలమయంగ మారింది.
కంపెనీలో నిల్వ ఉంచిన కాఫీ గింజలు పూర్తిగా నీటిలో మునిగి దెబ్బతిన్నాయి. ఈ కాపీ గింజల విలువ దాదాపు లక్షల్లో ఉంటుందని కంపెనీ యజమానులు తెలిపారు.
కాఫీ కంపెనీలో నీరు చేరడంతో ఈరోజు ఉదయం నుంచి కంపెనీ పని చేయక పోవడంతో భారీగా నష్టం వాటిల్లినట్లు కార్మికులు తెలిపారు.
- Advertisement -



