- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి 90 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు తెలిపింది. అయితే, జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం.. దీని తీవ్రత 6.07గా నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ భూకంపం ధాటిని ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
- Advertisement -



