- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఫోన్ మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతున్న విద్యార్థినిని రైలు ఢీ కొట్టింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. బీటెక్ విద్యార్థిని హవిలా షారూన్ ఫోన్లో మాట్లాడుకుంటూ పట్టాలు క్రాస్ చేస్తుండగా అప్పుడే వచ్చిన కాన్పూర్ బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. హవిలా షారూన్ కావలిలోని విట్స్ కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



