- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ శాఖల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పదోన్నతులకు ఆమోదం తెలుపుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సుమారు 130 మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరింది. గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు సూపరింటెండెంట్లుగా, అలానే సీనియర్ అసిస్టెంట్లకు కూడా ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు లభించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



