నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. నేడు తిరుపతి పర్యటనను ముగించుకొని హైదరాబాద్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి రాజ్ భవన్ వెళ్లి మధ్యాహ్న భోజనం తరువాత రాజ్ భవనులో విశ్రాంతి తీసుకోనున్నారు. మధ్యామ్నం 3.50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. అనంతరం 4 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరిగే భారతీయ కళా మహోత్సవాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు తిరిగి రాజ్ భవన్ కు చేరుకుంటారు. అక్కడే బస చేసి మరుసటి రోజైన శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి బయలుదేరి వెళ్లనున్నారు.
నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



