Saturday, May 17, 2025
Homeఆటలువాంఖ‌డేలో రోహిత్ ఎమోష‌న‌ల్ స్పీచ్‌..

వాంఖ‌డేలో రోహిత్ ఎమోష‌న‌ల్ స్పీచ్‌..

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్: ముంబ‌యిలోని ప్ర‌ఖ్యాత వాంఖ‌డే స్టేడియంలో నిన్న‌టి నుంచి రోహిత్ శ‌ర్మ స్టాండ్ అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. భార‌త్‌తో పాటు ముంబ‌యి క్రికెట్‌కు హిట్‌మ్యాన్ అందించిన సేవ‌ల‌కుగానూ ముంబ‌యి క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియంలో ఓ స్టాండ్‌కు అత‌డి పేరును పెట్టి గౌర‌వించింది. శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సహా అనేక మంది ప్రముఖుల సమక్షంలో అతని పేరు మీద ఒక స్టాండ్‌ను ప్రారంభించి సత్కరించింది. ఇక‌, ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నీల్లో టీమిండియాను నడిపించిన రోహిత్ శర్మ తన అర్ధాంగి రితికా సజ్దే, అతని తల్లిదండ్రులు, కొంతమంది ముంబ‌యి ఇండియన్స్ (ఎంఐ) ఆటగాళ్లతో కలిసి హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా హిట్‌మ్యాన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యాడు. ఆ స‌మ‌యంలో భ‌ర్త ఎమోష‌న‌ల్‌ స్పీచ్‌కు భార్య‌ రితికా కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ రోహిత్ ప్రత్యేక క్షణాన్ని జరుపుకుంటుండగా ఆమె కన్నీళ్లను తుడుచుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -