- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కృష్ణా జిల్లా, గన్నవరం శివారులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు శ్రీకాకుళం నుంచి తిరిగి వస్తుండగా, గన్నవరం మండలం చిన్న ఆవుపల్లి వద్ద లారీని ఢీకొట్టింది. వెనుక వస్తున్న కారు కూడా బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్న పిల్లలతో సహా 17 మంది పెళ్లి వారికి స్వల్ప గాయాలు కాగా, బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆదివారం నంద్యాల జిల్లాలో బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
- Advertisement -



