- Advertisement -
- – నిర్మాణాలకు మార్కౌట్ జిపి సెక్రెటరీ మనోహర్
నవతెలంగాణ – మద్నూర్ - మద్నూర్ మండలంలోని దన్నూర్ జిపి పరిధిలో అర్హులైన నిరుపేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మార్కౌట్ వేసినట్లు దన్నూర్ గ్రామ జిపి సెక్రెటరీ జె. మనోహర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మంజూరిలో అర్హులైన వారికి గుర్తించి ఇల్లు నిర్మించుకోవడానికి మార్కౌట్ వెయ్యడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి పార్టీసిప్పెట్గా ఆ గ్రామ పెద్దలు దేవిదాస్ పటేల్ నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు మారుతి ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుకర్, పాండురంగు, వీరితో పటు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -