- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్గఢ్లో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నారు. ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.
- Advertisement -



