- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ గా వొన్న తిరుపతి రావు శుక్రవారం పిఏసిఎస్ కార్యాలయంలో చైర్మన్ ఇప్ప మొండయ్య, కార్యనిర్వహన అధికారి సంతోష్ సమక్షంలో రాజీనామా సమర్పించారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తిరుపతి రావు తాడిచెర్ల మేజర్ గ్రామపంచాయతీలో 9వ వార్డు సభ్యుడుగా పోటీ చేసి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి, ఎన్నికల అధికారులతో పంచాయతీ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లుగా తెలిపారు.
- Advertisement -



