- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఎల్లుండి వరకు పలు జిల్లాల్లో శీతల గాలులు వీస్తాయని IMD తెలిపింది. ఇవాళ ఉదయం 8.30 గంటల వరకు బయటకు రావొద్దని హెచ్చరించింది. ఈ మేరకు 11 జిల్లాలు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
- Advertisement -



