నవతెలంగాణ – హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు వినాయకన్ షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. వివరాల్లోకి వెళితే… వినాయకన్ ప్రస్తుతం ‘ఆడు 3’ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. తొడుపుజ ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్లో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఆయన ప్రమాదవశాత్తూ గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన భుజం, మెడ భాగంలోని నరాలు, కండరాలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. వెంటనే యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఆయనకు కనీసం ఆరు వారాల పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు.
‘జైలర్’ విలన్ కు గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



