– వృద్ధులకు విందుభోజనం ఏర్పాటు
నవతెలంగాణ – అశ్వారావుపేట
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,విజయవాడ కాపు నేత వంగవీటి మోహనరంగా వర్ధంతి ని అశ్వారావుపేట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక అమ్మ సేవా సదనం వృద్ధాశ్రమంలో ని వృద్ధులకు విందుభోజనం ఏర్పాటు చేసారు. కుల మతాలకతీతంగా పేద ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావు,మండల అధ్యక్షులు కురిశెట్టి నాగబాబు నాయుడు, కట్టా శ్రీనివాసరావు, తాడేపల్లి రవి, బండారు శ్రీనివాసరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుమల శెట్టి అప్పారావు,చిలకల గండి ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ నరాల శ్రీనివాసరావు, మద్దాల నాగేశ్వరరావు, చిన్నంశెట్టి సుబ్బారావు, బండి సురేష్, కొరసిక రామకృష్ణ, రాంబాబు, పసుపులేటి ఫణీంద్ర, తిరునాటి సంజయ్, వనమాల గోపాలకృష్ణ, రఘురాం, సత్తిబాబు, రాజశేఖర్, పసుపులేటి నరేష్, అయ్యప్ప, నరాల శంకర్, బండారు సాయి పాల్గొన్నారు.



