- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏపీలోని పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు. వాషింగ్టన్లో జరిగిన కారు ప్రమాదంలో కొటికలపూడి కృష్ణ కిశోర్ (45), ఆశ (40) ప్రాణాలు కోల్పోయారు. వారి కుమారుడు, కుమార్తె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కృష్ణ కిశోర్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. 10 రోజుల క్రితమే కృష్ణ కిశోర్, ఆశ పాలకొల్లు వచ్చి వెళ్లారు.
- Advertisement -



