- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జనవరి 14, 15, 16 తేదీల్లో జరిగే మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్లకు ప్రేక్షకులు హాజరు కాలేరని తెలుస్తోంది. నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. అయితే, ముంబయిలో జనవరి 15న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నందున, ఈ మ్యాచ్లకు తగిన భద్రత కల్పించడం సాధ్యం కాదని ముంబయి పోలీస్ శాఖ బీసీసీఐకి తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
- Advertisement -



