నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ తాజ్ పూర్ లక్ష్యంగా సోమవారం తాజ్ పూర్ గ్రామంలో సుమారు క్వింటాలు చెత్త మోయగల తడి చెత్త -పొడి చెత్త ట్రాలీ చెత్త డబ్బాలను (డస్ట్ బిన్ )గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ , ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ చెత్త డబ్బాలను (డస్ట్ బిన్ )గ్రామంలో చెత్త సేకరణ వాహనం తిరగడానికి ఇబ్బంది గా ఉన్న గళ్లీలలో, జనం ఎక్కువగా ఉండే చౌరస్తా లలో అధిక చెత్త జమయ్యే ప్రదేశాలలో ఉంచడానికి నిర్ణయించిన్నట్లు, గ్రామ ప్రజలు తడి చెత్త -పొడి చెత్త ను సూచించిన డబ్బాలలో వేయవలెను.వాటిని వినియోగించు కోకుండా నిర్లక్ష్యం గా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేసినచో సీసీ కెమెరా ల ద్వారా పరిశీలించి వారికి గ్రామపంచాయతీ 500/-నుండి 1000/-వరకు జరిమానా వేయాలని నిర్ణయించడమైనది.. కావున గ్రామప్రజలు సహకరించి గ్రామాన్ని పరిశుభ్రత లో అగ్ర స్థానంలో ఉంచాలని కోరారు.
స్వచ్ఛ భారత్ -స్వచ్ఛ తాజ్ పూర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



