Wednesday, April 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తస్లీమాను మర్యాదపూర్వకంగా కలసిన బిఎస్ఎస్ నాయకులు

తస్లీమాను మర్యాదపూర్వకంగా కలసిన బిఎస్ఎస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – శాయంపేట: అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వరంగల్ మహమ్మద్ తస్లీమా ను బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారపెల్లి క్రాంతి కుమార్, మాట్లాడుతూ తస్లీమా చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని కొనియడారు. గతంలో తస్లీమ్ సబ్ రిజిస్ట్రార్ స్థాయిలో ఉండి అనేకమంది పేదవారికి, ఆపదలో ఉన్నవారికి సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సెలవు రోజులలో వ్యవసాయ కూలి పనులకు వెళుతూ వచ్చిన డబ్బులతో కష్టాల్లో ఉన్న వారికి ఇస్తూ గొప్ప దాన గుణాన్ని చాటుకుందని తెలిపారు. తస్లీమా అక్క సబ్ రిజిస్ట్రార్ స్థాయి నుండి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వరంగల్ ప్రమోట్ కావడం సంతోషంగా ఉందని అన్నారు, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం బిఎస్ఎస్ , ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు మారపల్లి విజయ్ కుమార్, జిల్లా నాయకులు పెంబర్తి భరత్ చంద్ర, మండల అధ్యక్షులు మారపల్లి సుధాకర్ పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -