నవీన్ పొలిశెట్టి కథనాయకుడిగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించింది.
నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథనాయిక. ఈ సినిమా నేడు (బుధవారం) థియేటర్లలో అడుగుపెడుతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బందం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ, ‘మన తెలుగువారికి సంక్రాంతి అనేది ప్రత్యేకమైన పండుగ. ఎన్ని బాధలున్నా అవన్నీ మర్చిపోయి మన వాళ్ళను కలుసుకొని సంతోషంగా ఉంటాం. ఒత్తిడిని పక్కన పెట్టి, పిండి వంటలు తింటూ, నలుగురితో నవ్వు కుంటూ చాలా సరదాగా ఉంటాం. అలాంటి ఎనర్జీనే ఈ సినిమాలో చూడబోతున్నారు. మన ఒత్తిడిని దూరం చేసి, హాయిగా నవ్వించేలా సినిమా ఉంటుంది. ట్రైలర్కి మీ నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన.. సినిమాపై మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ట్రైలర్లో ఉన్న జోక్స్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఒక పర్ఫెక్ట్ పండగ సినిమాలా ఉంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్లా ఉంది. చాలా చాలా బాగుంది అంటూ అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే బుకింగ్స్కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్లో ప్రీ సేల్స్తోనే నా గత చిత్రాల ఓపెనింగ్స్ని దాటేసింది. మీరు ఈ సినిమాపై చూపుతున్న ఆసక్తికి తగ్గట్టుగానే.. మిమ్మల్ని అలరించేలా ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు.
‘ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. మీరు ఈ సినిమాని ఖచ్చితంగా ఎంజారు చేస్తారు. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. మీ కుటుంబంతో కలిసి సినిమా చూసి ఎంజారు చేయండి’ అని కథానాయిక మీనాక్షి చౌదరి అన్నారు.
‘సినిమా చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్టైనర్ ఇది. ఈ పండగకు మీ కుటుం బంతో కలిసి చూసి హాయిగా నవ్వుకునే క్లీన్ ఎంటర్టైనర్ ఇది’ అని దర్శకుడు మారి చెప్పారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, ”గోదావరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన కథతో ఈ సినిమా రూపొందింది. నవీన్ శైలిలో చాలా సరదాగా సినిమా ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్ కూడా ఇందులో ఉంటుంది. సినిమా ఎంత నవ్విస్తుందో.. అదే సమయంలో చివరిలో ఒక మంచి ఎమోషన్ కూడా ఉంటుంది’ అని తెలిపారు.
సంక్రాంతి పండగలా ఉండే చిత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



