నవతెలంగాణ-హైదరాబాద్: దక్షిణాదిలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకరైన ధన్రాజ్గిర్ వారసురాలు, ప్రఖ్యాత హిందీ, ఆంగ్ల కవయిత్రి, ప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్ర శర్మ జీవన సహచరి రాజకుమారి ఇందిరాదేవి ధన్రాజ్గిర్ (96) ఇకలేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు జ్ఞాన్ బాగ్ ప్యాల్సలో తుదిశ్వాస విడిచారు. 1930, ఆగస్టు17న నిజాం సంస్థాన సలహాదారుడు రాజా ధన్రాజ్గిర్, రాణి ప్రమీలా దేవిలకు ముంబైలో ఇందిరా దేవి జన్మించారు.చిన్నతనంలోనే హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడే మెహబూబియా బాలికల పాఠశాలలో హైస్కూల్ విద్య అభ్యసించారు.
అనంతరం ఆమె ఇల్లు జ్ఞాన్ బాగ్ ప్యాలెస్సే ఆమె విద్యాలయంగా మారింది. ఇక్బాల్ ప్రేరణతో చిన్న వయసులోనే సాహిత్యాభిమానిగా మారారు. తొమ్మిదో ఏటనే రచనలు రాయడం ప్రారంభించారు. ముంబై, పూణె, ఊటీ, హైదరాబాద్ నగరాల్లో వీరికి రాజ ఠీవీని ప్రతిబింబించే అందమైన ప్యాలె్సలున్నాయి. హైదరాబాద్ వారసత్వ కట్టడాల్లో ఒకటైన జ్ఞాన్ బాగ్ ప్యాలెస్ వీరి పూర్వీకులు యూరోపియన్ శైలిలో 1890లో నిర్మించారు. తండ్రి రాజా ధన్ రాజ్గిర్ సాహిత్యాభిమాని కావడంతో బాల్యం నుంచి ఆంగ్ల, హిందీ, ఉర్దూ, మరాఠా సాహితీవేత్తలతో ఆమెకు పరిచయం ఏర్పడింది.
ఇది ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఉర్దూలో ఆమె ద్విపదులు రాశారు. ‘‘ది అపోస్టల్ ‘‘ పేరుతో తొలి కవితా సంపుటి వెలువడింది. రిటర్న్ ఎటర్నిటీ, పోయెమ్స్ ఆఫ్ మై నేషనల్ మెమోరీ, విండ్ బ్లోస్ ఫ్రమ్ స్కా ఫోల్డ్ తదితర 12 పుస్తకాలు ఇందిరా దేవి రాశారు. తన కుటుంబ వారసత్వ చరిత్రను ‘‘మెమోరీస్ ఆఫ్ ది దక్కన్ ‘‘ పేరుతో కాఫీటేబుల్ బుక్ గా ప్రచురించారు. వరల్డ్ పోయెట్రీ సొసైటీ ఇంటర్ కాంటినెంటల్ సంస్థ 1973లో ఇందిరా దేవిని నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ చేసింది. ఇలాంటి అరుదైన గౌరవం పొందిన తొలి భారతీయ కవయిత్రి ఇందిరాదేవి కావడం విశేషం. ఆమె రాసిన కొన్ని ఆంగ్ల కవితలను ప్రముఖ కవి ముగ్థుమ్ ఉర్థూ లోకి అనువదించారు.
ఆమె తుది కోరిక మేరకు అత్యంత సాదాసీదాగా తెలుగు వైదిక సంప్రదాయం ప్రకారం కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తమ్ముడు రాంమ్మూర్తి కుమారుడు విశ్వనాథ శోభనాద్రి చేతుల మీదగా అంతిమ సంస్కారాలు నిర్వహిచనున్నట్లు సమాచారం.



