– సంక్రాంతి పర్వదిన పురస్కరించుకొని మహిళా ఓట్లకు చీరలు పంపిణీ
– ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాం
– కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు పెరుమాండ్ల రాజు గౌడ్
నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ మహిళల అభివృద్ధి లక్ష్యంగా అండగా ఉండి వారిని ఆదుకుంటారని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు పెరుమాండ్ల రాజు గౌడ్ అన్నాడు. బుధవారం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళా ఓటర్లకు చీరలను ప్రతి గడపకు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక మహిళలకు పెద్దపీట వేసిందని అన్నారు. దానిలో భాగంగా బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాన్ని పూర్తిస్థాయిలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో అన్ని రంగాలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని అన్నారు. ముందుగా మహిళల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు అందులో భాగంగా తెలంగాణలో సంప్రదాయ బద్దంగా నిర్వహించే సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు తమ వంతుగా వారి కుటుంబ సభ్యుడిగా ఆడబిడ్డలకు చీరలను అందించే కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రతి కార్యకర్తకు కష్టసుఖాల్లో అండగా ఉండి వారిని ఆదుకునేందుకు నిరంతరం కృషి చేస్తానని సందర్భంగా తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరిచేందుకు ఎమ్మెల్యే మంత్రులు సహకారం తీసుకొని బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామాన్ని పూర్తిస్థాయిలో రూపురేఖలు మార్చి రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు యువత ముందుకు వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పిట్టల ఉప్పలయ్య కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు యువకులు నాయకులు పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు అండగా ఉండే ఆదుకుంటాను
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



