నవతెలంగాణ-హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో రాజన్న, సమ్మక్క గుళ్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. రాజన్న గుడి డెవలప్ అవుతుందంటే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషేనని అన్నారు. రాజన్న అనుబంధ భీమేశ్వర ఆలయంలో స్వామి వారిని మంత్రి శుక్రవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సాధారణ భక్తుల మనోభావాలను గుర్తిస్తున్నారన్నారు. గతంలో రాజన్న గుడిని డెవలప్ చేయవద్దని దుష్ప్రచారాలు చేశారని.. కానీ భక్తుల మనోభావాలను గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి ఆలయాన్ని అభివృద్ది చేస్తున్నారని చెప్పారు. జనవరి 18న మేడారంలో కేబినెట్ మీటింగ్ ఉందని చెప్పారు. 19న సమ్మక్క సారలమ్మ గుడిని పునః ప్రారంభించబోతున్నామని తెలిపారు.



