- సంక్రాంతికి బియ్యం,మద్యం,మాంసం పంపిణీ
నవతెలంగాణ-ఆలేరు: ఆలేరు నియోజకవర్గంలో ముందస్తు మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొదలైంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటిల్లో ఎన్నికల్లో పోటీచేయనున్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు..ఓటర్లను ఆకర్షించడానికి తాయిలాల పంపకాలు షురూ చేశారు. భాస్మతి బియ్యంతో పాటు మద్యం మాంసం పంపిణీ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు ఆశావహులు. సంక్రాంతి సందర్భంగా గురువారం ఉదయమే ఆలేరులో రెండు వార్డులో, యాదగిరిగుట్టలోని పలు వార్డులలో పండగ రోజు ఇంటింటికి తిరుగుతు.. మాంసం,మద్యం పంపిణీ చేసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటూ మీ ఆశీర్వాదం కావాలని ఓటర్లను వేడుకున్నారు.
ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారంలో మున్సిపల్ ఎన్నికల తేదీ ఖరారు కానున్నాయి. ఈ నేఫథ్యంలో ఎన్నికల టికెట్ ఆశించే అభ్యర్థులు ఖర్చుకు భయపడడంలేదు. ఓటర్ల లబ్దిపోందడానికి 30 నుండి 40 లక్షలు వరకు ఖర్చు చేయడానికి ఆయా అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది. మరోవైపు ఆశావహులు ముందస్తు ప్రచారం మొదలు పెట్టగా, అధికార, ప్రతిపక్షాలు రహస్యంగా గెలుపు గుర్రాల కోసం సర్వే మొదలుపెట్టాయి. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తినే కార్పొరేషన్ పోరులో నిలిపేందుకు కసరత్తులు చేస్తున్నాయి.



