Friday, January 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామస్తుల సహకారంతో నిరుపేద మహిళ అంత్యక్రియలు

గ్రామస్తుల సహకారంతో నిరుపేద మహిళ అంత్యక్రియలు

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్ : కులవృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబంలో అనారోగ్యం బారిన పడి మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలేసిన పేద కుటుంబానికి చెందిన సంఘం లక్ష్మి మృతి చెందగా అంత్యక్రియలకు గ్రామస్తులు చందాలు వేసుకొని నిర్వహించారు. రాయపోల్ మండల కేంద్రానికి చెందిన సంఘం లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందింది. వీరి కుటుంబం నాయి బ్రాహ్మణ కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. కేవలం వృత్తి మీదనే ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి అనారోగ్యం బారిన పడితే వైద్యం చేయించుకోవడానికి సరిపడా డబ్బులు లేక అప్పులు చేసి మరీ చికిత్స చేయించుకున్నారు. అలా నెట్టుకొస్తుండగా పరిస్థితి విషమించి సంఘం లక్ష్మి మృతి చెందింది. దానితో వారి కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అంత్యక్రియలు కూడా జరిపించలేని పరిస్థితిలో మానవత దృక్పథంతో గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేశారు. ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి తన వంతు సహకారంగా రూ.10 వేలు, సత్తుగారి యాదవ రెడ్డి రూ. 5 వేలు, కుమ్మరి శాలివాహన సంఘం, ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాలు వారికి తోచిన సహాయం చేసి అంత్యక్రియలు నిర్వహించారు. ఇలాంటి పేద కుటుంబానికి సహాయం చేయదలచిన వారు ఇంకా ఎవరు ఉన్నా మానవత్వంతో సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోగలరని గ్రామస్తులు, బంధువులు వేడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -