Monday, May 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రశాంతంగా నీట్‌

ప్రశాంతంగా నీట్‌

- Advertisement -

జూన్‌ మొదటి వారంలో ఫలితాలు?
దేశవ్యాప్తంగా 22.7 లక్షల మంది హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌తోపాటు ఇతర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) యూజీ-2026 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జూన్‌ మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని తెలిసింది. దేశవ్యాప్తంగా 552 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. దేశవ్యాప్తంగా 22,79,743 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వారిలో 13,32,928 మంది అమ్మాయిలు, 9,46,815 మంది అబ్బాయిలున్నారు. దరఖాస్తు చేసిన వారిలో 22.7 లక్షల మంది పరీక్షకు హాజరైనట్టు సమాచారం. దేశవ్యాప్తంగా 13 భాషల్లో నీట్‌ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించింది. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయా ళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళంతో పాటు ఉర్దూ భాషలోనూ నిర్వహించారు. నీట్‌ పరీక్షను తెలంగాణలో 24 పట్టణాల్లో 199 కేంద్రాల్లో జరిపారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగామ, కొత్తగూడెం, మహబూబాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, మేడ్చల్‌, నల్లగొండ, నిజామాబాద్‌, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్‌, హైదరాబా ద్‌, సికింద్రాబా ద్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఈ పరీక్షను నిర్వహిం చారు. రాష్ట్రం నుంచి సుమారు 73 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తే 71,500 మంది పరీక్షకు హాజరైనట్టు తెలిసింది. అయితే నీట్‌ పరీక్షలో ఫిజిక్స్‌ ప్రశ్నలు కొంత కఠినంగా వచ్చినట్టు నిపుణులు, విద్యార్థులు అభిప్రాయపడ్డారు. మిగిలిన బయాలజీ, కెమిస్ట్రీ ప్రశ్నలు సాధారణంగానే వచ్చినట్టు సమాచా రం. నీట్‌ ప్రశ్నాపత్రంలో ఎక్కువ ప్రశ్నలు ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ నుంచే వచ్చాయన్న అభిప్రాయం వచ్చింది.

నీట్‌ విద్యార్థులకు కేటీఆర్‌ శుభాకాంక్షలు
నీట్‌ పరీక్షకు హాజరైన్న విద్యార్థులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా వేదికగా ఆదివారం స్పందిస్తూ విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపారు. నీట్‌ విద్యార్థులు ఏండ్ల తరబడి కష్టపడి, అంకితభావం వారిని ఈ స్థాయికి తీసుకొచ్చాయని పేర్కొన్నా రు. పరీక్ష సమయంలో ఆందోళన చెందకుండా, ప్రశాంతంగా ఉండాలని సూచించారు. వారి సాధన మీద వారికి నమ్మకం ఉండాలని కోరారు. ప్రశాంతంగా ఉంటూ శాయశక్తులా కృషి చేసి పరీక్ష రాయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -