- Advertisement -
నవతెలంగాణ-హైద్రాబాద్ : ఇరాన్లో తీవ్ర నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి తరలించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడతలో పలువురు ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో కుటుంబ సభ్యులను కలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, ఇంటర్నెట్ నిలిచిపోవడంతో సంప్రదింపులు లేవని తెలిపారు.
- Advertisement -



