Saturday, January 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలువీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న దంపతులు అరెస్ట్

వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న దంపతులు అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అప్పుల ఊబి నుండి బయటకు రావడానికి కరీంనగర్ జిల్లాకు చెందిన దంపతులు సామాజిక మాధ్యమాల్లో పురుషులకు వల వేసి రూంకి పిలిపించి ప్రయివేటు వీడియోలు తీస్తున్నారు. ఆ తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారు. KRNRకు చెందిన ఓ లారీ వ్యాపారిని బ్లాక్‌మెయిల్ చేసి రూ.13 లక్షలు తీసుకుని.. మరో రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఫోన్, నగదు, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇలా సంపాదించిన డబ్బులతో ఆరేపల్లిలో రూ.65 లక్షల విలువైన ప్లాట్, ఫర్నిచర్, రూ.10 లక్షల విలువైన కారును కొన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -