- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అండర్-19 ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు బ్యాటింగ్ పూర్తయింది. వర్షం అంతరాయంతో 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టీమ్ఇండియా 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టులో అభిజ్ఞాన్ కుందు (80), వైభవ్ సూర్యవంశీ (72) అర్ధశతకాలతో చెలరేగారు. కనిష్క్ చౌహాన్ (28) ఫర్వాలేదనిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహద్ 5, ఇక్బాల్ హొస్సేన్ 2, తమీమ్ 2, పర్వేజ్ 1 వికెట్ తీశారు.
- Advertisement -



