Sunday, January 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను కత్తితో పొడిచిన భర్త

తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను కత్తితో పొడిచిన భర్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డి.పోచంపల్లిలో డాక్టర్ బస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్త సాదుల్లా, తన భార్య సాహిని(30)ని తాగడానికి డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -