- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించిన ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్, తాత సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సినీ నటుడు నందమూరి కల్యాణ్ రామ్, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ను స్మరించుకున్నారు.
- Advertisement -



