- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో జరిగిన రాజకీయ ప్రచార కార్యక్రమంలో తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో టీవీకే చీఫ్ విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. జనసమూహ నిర్వహణ, ప్రణాళిక వైఫల్యాలపై సీబీఐ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో, విచారణ కోసం సీబీఐ విజయ్ను ఢిల్లీకి పిలిపించింది.
- Advertisement -



