నవతెలంగాణ-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ 2026 విడుదలయ్యింది. మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. దీనిని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ నవంబర్ 21, 2025న విడుదల చేసింది. ఈ పరీక్షలు మార్చి 16 ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి. విద్యార్థులు పూర్తి షెడ్యూల్ ను అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.in లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీలను వేర్వేరు పేపర్లుగా నిర్వహిస్తారు.
పరీక్షల తేదీలు (ముఖ్యమైనవి) :
మార్చి 16: మొదటి భాష
మార్చి 18: రెండో భాష
మార్చి 20: ఇంగ్లీష్
మార్చి 23: గణితం
మార్చి 25: భౌతికశాస్త్రం (ఫిజిక్స్)
మార్చి 28: జీవశాస్త్రం (బయాలజీ)
మార్చి 30: సాంఘికశాస్త్రం (సోషల్ స్టడీస్)
మార్చి 31: మొదటి భాష (పేపర్-2)
ఏప్రిల్ 1: ఓఎస్ఎస్సీ రెండో భాష (పేపర్-2)



