- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చెన్నైలో ఫుడ్ డెలివరీ బాయ్పై కత్తులతో దాడి చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్గా పోస్ట్ చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి వేళచ్చేరి నెహ్రూనగర్లో జరిగిన ఈ ఘటనలో యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. మరికొందరు ఈ దాడిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వేళచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసి, విష్ణు, నంద, సుందర్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
- Advertisement -



